3, మార్చి 2010, బుధవారం

రండి రండి........




జస్టీస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ కేవలం సంప్రదింపులకు మాత్రమే అని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోని ప్రజలు, వివిధ వర్గాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలను ఈ కమిటీ సేకరిస్తుంది. అయితే, ఈ కమిటీలో వివిధ రంగాలకు చెందిన నిపుణులకు స్థానం కల్పించినట్టు ఆయన తెలిపారు. కాగా, ఈ కమిటీలో చోటు కల్పించిన ఐదుగురు సభ్యుల్లో ఒక్కొక్కరు ఒక్కో రంగానికి చెందిన వారు కావడం గమనార్హం.

కమిటీ ఛైర్మన్‌గా జస్టీస్ శ్రీకృష్ణ సుప్రంకోర్టు మాజీ న్యాయమూర్తిగా పని చేశారు. ఇక కమిటీలోని మిగిలిన సభ్యులల్లో వీకేదుగ్గల్ ఒకరు. ఈయన కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి. రవీందర్ కౌర్.. న్యూఢిల్లీలోని ఐఐటీ సామాజిక శాస్త్రవేత్త.

రణబీర్ సింగ్.. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇకపోతే.. అబూసలేం షరీఫ్.. ప్రపంచ ఆహార ఇన్‌స్టిట్యూట్‌లో సీనియర్ రీసెర్చ్‌గా పని చేస్తున్నారు. ఈ కమీటీలో ముగ్గురు ప్రొఫెసర్లు, న్యాయ, ఆర్థిక నిపుణులు కావడం గమనార్హం.

మా తెలంగాణా మాకు ఇస్తారని కోరుకుంటూ.....
తెలంగాణా ముద్దుబిడ్డ

జై తెలంగాణ.....జై జై తెలంగాణా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి


Free Blogger Templates by Santosh Kumar and Unbelievable Photo Collection. Powered by Blogger