19, జనవరి 2010, మంగళవారం

తెలంగాణా మహా పాదయాత్ర.......




ఉస్మానియా విద్యార్ధి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జెఎసి) సోమవారం నుంచి తెలంగాణ జిల్లాల మహా పాదయాత్ర ప్రారంభించింది. తెలంగాణా రాష్ట్ర సమితి ( టి. ఆర్. ఎస్.) అంది స్తున్న సంపూర్ణ సహకారంతో విద్యార్థి జెఎసిరెండు బృందాలుగా విడి పోయి ఉత్తర తెలంగాణా, దక్షణ తెలంగాణా ప్రాంతాల్లోని జిల్లాల్లో పాదయాత్రను చేప ట్టింది. ఆయా జిల్లాల్లోని విద్యార్ధులు, ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి చైతన్యం తెచ్చేందుకు సంకల్పించిన ఈ పాదయాత్రకు పోలీ సుల నుంచి అనుమతి లభించిందా ? లేదా అన్నది స్పష్టంగా తెలియరాలేదు. మహా పాద యాత్ర సందర్భంగా జిల్లాల్లో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందంటూ పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి తెలంగాణ జిల్లాల ఎస్పీలు, ఉన్నతాధికార్లకు సమాచారం అందింది.

పాదయాత్ర దారి పొడవునా విద్యార్ధుల వ్యవహారశైలిపై నిఘా వర్గాలు కన్నేసి ఉంచాలని ఆదేశాలు అందినట్టు తెలిసింది. ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల నుంచి సోమవారం మహాపాద యాత్ర ప్రారంభమవు తుంది. ఒక బృందం రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం మీదుగా వరంగల్ చేరు కుంటుంది. మరోబృందం రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆదిలా బాద్, కరీం నగర్ మీదుగా వరంగల్ చేరుకుంటుంది. రెండు బృందాలు ఫిబ్రవరి 7వ తేదీ నాటికి వరంగల్ చేరు కుని అక్కడ జరిగే భారీ బహిరంగసభలో ప్రసంగిస్తారు. విద్యార్ధులు,ఉద్యమంలో చురుగ్గా పాల్గొనే వారంతా ఈ సభలో పాల్గొనే విధంగా జెఎసి కృషి చేస్తుంది.

13, జనవరి 2010, బుధవారం

సిరిగల్ల తెలంగాణా చరిత్ర.....





ఇది తెలంగాణ. మారు పేరు గాయాలవీణ. దీని గతం పోరాటచరిత్ర. వర్తమానంలో నా ఆశను, ఆశయాలను భుజానికి తగిలేసుకొని సాగిపోతున్న బిడ్డలను కన్న తల్లి. నాడు నైజామోడికి వ్యతిరేకంగా పోరాడింది. అరవై తొమ్మిదిలో ఆంధ్ర దోపిడికి వ్యతిరేకంగా కొట్లాడింది. డెబ్బైలో దొరోడికి వ్యతిరేకంగా దండు కట్టింది. ఇంకా దండు సాగుతున్నది. ఇన్నేండ్లు నడిచి… నడిచి… కొట్లాడి…. కాళ్ళకు కలుకులొచ్చినవి. అయినా ఒంట్లో సత్తువ ఉన్నంతవరకు ఉద్యమిస్తూనే ఉంది.

తెలంగాణ గురించి తెలుసుకోవటమంటే నిప్పుల చరిత్రను తేలుసుకోవటమే. దీని బాట పూల బాటకాదు. ముళ్ళ బాట. ఆ ముళ్లను ఏరేసుకుంటూ నడిచినా నడుస్తున్న వాళ్ళు ఉన్నారు. నిజాం పిశాచి నిప్పుల్లో నడిపించాడు. అట్లా నడుస్తూనే సాయుధమయ్యింది. శత్రువును పరిగెత్తించింది. తన బిడ్డలకు పూల బాట వస్తుందని ఆశపడ్డది. మోసం చేశారు. సీటు కోసం దగా చేసారు. నమ్మినవాళ్లే నట్టేట ముంచారు. వాళ్లే ఇవ్వాళ విశాలాంధ్ర పేరిట విశాల దోపిడీలో భాగమవుతున్నారు. భాష పేరిట, సంస్కృతి పేరిట ఒకటవుదామని ఢిల్లీలో పంత్ నాయకత్వంలో ‘పెద్దమనుషుల ఒప్పందం‘ ద్వారా కుట్ర చేశారు. న్యాయం చేస్తామన్నారు. అన్నదమ్ముళ్లా ఉందామన్నారు. అందరం ఒకటేనన్నారు. అన్యాయం చేశారు. పదేండ్లపైగానే చూసింది. కొలువులు లేవు. సీట్లు లేవు. చదువులు లేవు. అన్నీ తన్నుకుపోయారు. చదువురాదని ఎక్కిరించారు. భాష రాదని హేళన చేశారు. ఎన్నాళ్లని ఓర్చుకొనేది. ఎదురుతిరిగి కొట్లాడడం తెలంగాణకు కొత్తకాదు. “వాని తాతకు తాత నైజామోడు నాకెదురెవ్వని నాట్యమాడితే వీర తెలంగాణ చుట్టుముట్టితే పైజామూడి పరుగు తీసిండు” (జననాట్యమండలి పాటలు - పుట.40)

1707 లో ఔరంగజేబు మరణం తరువాత మొగల్ సామ్రాజ్య సుబేదార్‌గా ఉన్న నిజాం 1724లో స్వతంత్ర్యం ప్రకటించుకున్నాడు. ఇట్లా పురుడోసుకున్న నిజాం నిరంకుశ పాలన 1948 వరకు కొనసాగింది. ఈ కాలంలో తెలంగాణ ప్రజలు బానిస సమాజపు ఆనవాళ్లను చవిచూశారు. స్త్రీలను నగ్నంగా బతుకమ్మను ఆడించిన విసునూర్ దొరలకు అధికారం ఇచ్చినవాడు నిజాం. చెమటను నీరు చేసి పండించిన పంటను దోపిడి చేసిన జాగీర్దార్లకు అండగా నిలచింది నిజామే. ఉర్దూ అధికార భాష పేరిట తెలుగుభాషకు జీవం లేకుండా చేశాడు. మతోన్మాదంతో మత మార్పిడులను ప్రోత్సహించాడు. ఎదురు తిరిగిన వాళ్లను బూడిద చేశాడు.







ఉద్యమాల నేపధ్యం

మట్టిని ముట్టుకుంటే ఉద్యమాలు పూసే నేల ఇది. మట్టిమనుషుల ఆగ్రహం ఉద్యమాలుగా రూపొందింది. వ్యక్తులుగా శక్తులుగా ఈ ప్రాంతంలో అనేక ఉధ్యమాలు వచ్చాయి. “ఉద్యమం అనే మాటకు పైకెత్తుట, శ్రమము, ప్రయత్నము, సిద్ధమగుట, గట్టిపూనికతో చేసే ప్రయత్నము” (సూర్యారాయాంధ్ర నిఘంటువు, పుట.637) అని డిక్షనరీ అర్ధాలు ఉన్నాయి. అయితే ఆధునిక కాలంలో ఉధ్యమాన్ని విశాల అర్ధంలో వాడుతున్నాం. ఆంగ్లంలో ‘మూవ్మెంట్’ అనే పదానికి సమాన అర్ధం ‘ఉద్యమం’ అని వాడుతున్నాం. “ఒక లక్ష్యాన్ని సాధించడంకోసం జరిగే వ్యవస్థీకృత ప్రయత్నం” (చాంబర్స్ మినీ డిక్ష్నరీ, పేజి.324) ఉద్యమంగా చెప్పవచ్చు. మానవ జీవితంలో అనేక మార్పులు జరుగుతాయి. ఈ మార్పులన్నీ వాటంతటావే జరిగినవి కావు. వీటికొక గతితార్కిక నియమం ఉంటుంది. ప్రజలు ఒకవైపు ప్రకృతిపై పోరాడుతూ విజయం సాధిస్తూ ఉంటారు. మరోవైపు తోటి మనిషిపై కూడా పోరాటం మొదలు పెడతారు. ఈ పోరాటమే ఒక సమిష్టి రూపం తీసుకుంటుంది. దీనినే మనం ఉద్యమం అనొచ్చు. ఈ ఉద్యమం సమాజంలో మౌలిక మార్పుకు దారితీస్తుంది. ఏ మార్పు అయినా ప్రజల ప్రయత్నం వలన వస్తుంది తప్ప అప్రయత్నంగా ఊడిపడదు.

“వేళ్లూనుకొని ఉన్న పాత సంబంధాలు, పాత పద్ధతులు ఇక ఏ మాత్రం కొనసాగడానికి వీల్లేని పరిస్థితులాసన్నమయి, పాత వాటి మీద క్రమంగా అసంతృప్తి ప్రారంభమై, ఆ అసంతృప్తి రాను రాను పెరిగి పెద్దదవుతుంది. తద్వారా పాత-కొత్త సంబంధాల మధ్య సంఘర్షణ ఉద్యమాలకు దారితీస్తుంది” (తెలుగులో ఉద్యమం గీతాలు పుట 4)

మార్పు లేకుండా మానవ సమాజం లేదు. ఆ మార్పు కచ్చితంగా ముందడుగే. మనుగడ కోసం మనిషి పోరాడుతాడనే డార్విన్ సిద్ధాంతం మానవ పురోగతికి అద్దం పడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా “పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టిందని” మార్క్స్ చెప్పిన మాట శాస్త్రీయ సత్యం. ప్రపంచంలో వలస వాదాన్ని తరిమికొట్టి స్వేచ్చాగానాలు పీల్చుకున్న పోరాటం అమెరికన్ విప్లవం. భూస్వామ్య విధానాన్ని కూలదోసి పెట్టుబడిదారి విధానానికి పునాదులు వేసింది ఫ్రెంచ్ విప్లవం. రష్యాలో భూస్వామ్య, పెట్టుబడిదారి విధానాలను అంతం చేసి సామ్యవాదాన్ని నెలకొల్పింది సోషలిస్టు విప్లవం. ఇలా అనేక చోట్ల అనేక విప్లవాలు, ఉద్యమాలు పాత సామాజిక వ్యవస్థ పునాదులను కదిలించి కొత్త వ్యవస్థను నిర్మించాయి.

భారత దేశంలో కూడా అనేక ఉద్యమాలు వచ్చాయి. సంఘ సంస్కరణ, జాతీయోద్యమాల కాలంలోనే ఒకవైపు బ్రిటీష్ వారిపై పోరాడుతూనే అంతర్గత అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిచాయి. ఈ ప్రభావంతో తెలుగు నేలలో కూడా ఎన్నో ఉద్యమాలు జీవం పోసుకున్నాయి. దేశవ్యాపితంగా విస్తరించిన జాతీయోద్యమ భావాలు తెలుగు సాహిత్యంపై విశేష ప్రభావాన్ని చూపాయి.

ఇక బ్రిటీష్ పాలన ప్రభావం ఏమాత్రం లేని తెలంగాణలో భూస్వామ్య, జమీందారీ, జాగీర్దార్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చాయి. ఈ ఉద్యమాలు ప్రారంభంలో జానపద హీరోల నాయకత్వంలో మొదలయ్యాయి. నల్గొండ జిల్లాలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్, పాలమూర్లో మీరాసాబ్, పండుగోల్ల సాయన్న లాంటి వ్యక్తులు కొద్ది సమూహాన్ని కూడగట్టుకొని స్థానిక దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపారు. అయితే ఇవి వ్యవస్థలో సమూల మార్పును తీసుకరావడానికి నడిచిన ఉద్యమాలు కావు. స్థానిక నిరసనలు మాత్రమే. ఈ నాయకులను ఆనాటి పాలకులు దుర్మార్గంగా చంపేశారు. వీరిపై ప్రజలు వివిధ జానపద రూపాలలో కథలల్లుకున్నారు. పాటలు పాడుకున్నారు. తమ గుండెల్లో ప్రేమగా నిలుపుకున్నారు. కలుపుల్లో, కోతల్లో, కోలాటంలో ప్రత్యక్షం చేసుకొన్నారు.

తెలంగాణలో నిజాం పాలనకు వ్యతిరేకంగా సమిష్టి ఉద్యమ రూపాలు 1930లలో మొదలయ్యాయి. మొదటి నిర్మాణ రూపం అంధ్ర మహసభ. తెలుగు భాష మాట్లాడటానికి, రాయటానికి, చదవటానికి వీలులేని రోజులివి. జన్మనిచ్చిన భాష కోసం పోరాటం మొదలయ్యింది. అది రాను రాను ఆర్ధిక, సామాజిక, రాజకీయ ఆకాంక్షలతో పరిపక్వమైంది. అన్నిరకాలుగా బలవంతుడైన నైజామును ఎదుర్కోవటానికి ఆంధ్ర మహాసభ 1946లో సాయుధ పోరాటానికి సిద్దమైంది. ఈ ఉద్యమం 1953 వరకు అనేక తర్జనభర్జనల మధ్య కొనసాగి అదే సంవత్సరంలో ఆగిపోయింది. ఈ సంవత్సరంలోనే తెలంగాణ విద్య ఉద్యోగ రంగాలలో స్థిరపడిన హిందీ రాష్ట్రాల ప్రజలకు వ్యతిరేకంగా ఇక్కడి యువత ‘నాన్ ముల్కీ గో బ్యాక్’ అంటూ ఉద్యమాన్ని లేవదీశారు. ఈ సందర్భంలో జరిగిన కాల్పుల్లో 8 మంది విద్యార్ధులు మరణించారు. 1956లో నిరసనలు, విన్నపాల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఇక్కడి విద్యా, ఉద్యోగ రంగాలలో కోస్తాంధ్ర వాళ్లు నిండిపోయారనే కారణంతో 1969లో విద్యార్ధి, నిరుద్యోగులు 9 నెలలు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని నడిపారు.

ప్రపంచ వ్యాప్తంగా 60వ దశకం గర్జించు అరవైలుగా నమోదైంది. చైనా సాంస్కృతిక విప్లవ ప్రభావం ప్రపంచంపై పడింది. సమాజంలో మౌలిక మార్పు కోసం ఉద్యమాలు-పోరాటాలు జీవం పోసుకున్నాయి. పరిమిత ఆకాంక్షల కోసం వచ్చిన 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, నక్సల్బరి, శ్రీకాకుళ పోరాటాల ప్రభావంతో విప్లవోద్యమంగా రూపంతరం చెందింది. తరువాత దేశమంతా విస్తరించింది. 80వ దశకంలో అంధ్ర ప్రాంతంలో ప్రారంభమైన దళిత ఉద్యమం తెలంగాణలో స్థిరత్వాన్ని సంపాదించింది. సిద్ధాంత భావజాలాన్ని పెంచుకుంది. 1969లో ఆగిపోయిన తెలంగాణ ప్రజల ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష 90వ దశకంలో ఎజెండా మీదికి వచ్చి ఉద్యమ రూపాన్ని సంతరించికుంది. ఇది స్థూలంగా తెలంగాణలో ఉద్యమాల నేపధ్యం.

‘సమాజంలో సాహిత్యం, కళలు ఉపరితల అంశాలు. అయితే వీటికి పునాది అంశాలను ప్రభావితం చేసే లక్షణం కూడా ఉంది. ఎక్కువ మేరకు పునాది అంశాల చేత ప్రభావితమవుతూ సమాజంపై ప్రభావమేస్తాయి’. (ప్రజాసాహిత్యం-జయధీర్ తిరుమలరావు-పుట.1) సమాజంలో వస్తున్న మార్పులకు స్పందనగానే సాహిత్యం వస్తుంది. ఈ సాహిత్యం మౌఖిక రూపంలో ఉంటుంది. లిఖిత రూపంలో ఉంటుంది. శ్రమజీవుల భౌతిక సామాజిక జీవితం పునాది కాగా సాహిత్యం, కళలు ఉపరితలంలో ఉంటాయి. పనిచేస్తున్నప్పుడు, శ్రమనే వస్తువుగా చేసుకొని జీవితాన్నే పాడుకుంటారు. ఈ పాటలు వీరి పనిలో భాగంగా నోళ్ల నుంచి సహజంగా వెలువడుతాయి. ఇట్లా పుట్టే సాహిత్యమే మౌఖిక సాహిత్యం అవుతుంది. ఈ మౌఖిక సాహిత్యమే లిఖిత సాహిత్యానికి మూలమవుతుంది. ఈ సాహిత్యంలో ఉండే వస్తువు, రూపం, శిల్పం గొప్పగా కనిపిస్తాయి. ఈ సాహిత్యం నిండా గొప్ప జీవిత చిత్రణ ఉంటుంది

12, జనవరి 2010, మంగళవారం

అమావాస్య చంద్రుడు.........




నువ్వూ ఒక నాయకుడివా.....చంద్ర(మామ)బాబు
నువ్వొక అమావాస్య చంద్రుడివి
నువ్వూ ఎలాగో సిఎం పోస్ట్ కి అర్హుడివి కాదని తేలిపోయింది
కనీసం నీకు ప్రతిపక్ష నేతగా ఉండే అర్హత కూడా లేదా??
మొన్నటి ఎన్నికల్లో తెలంగాణా ఎజెండాగా పోటి చేసావ్
ఇప్పుడేమో తెలంగాణా అనగానే గోడ మీద పిల్లిలా ఇంట్లోంచి బయటకు రావడమేలేదు
నిజంగా ప్రతిపక్ష నేతవే ఐతే...ప్రజలకోసం ప్రభుత్వం తో పోరాడు...
లేకపోతె "తెలుగుదేశం" పార్టీ పగ్గాలు అన్న ఎన్టిఆర్ కొడుకు హరికృష్ణ కు ఇచ్చేసి
నారవారిపల్లి కి వెళ్లి నాట్లు నాటుకో.....
ఇంకా నీకు Z కేటగిరి భద్రతా అవసరమా మామా......



ప్రజాగళం............




ఆర్టీసిపై వడ్డన....ఎవరిది ఈ పాపం..........???
తెలంగాణా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు నువ్వు "చీపు" మినిస్టర్ అవకు
ఇంతకూ తమరు సిఎం పోస్ట్ కి అరుహుడువేన....???
ప్రజలను పాలించే సత్తా నీకుందా....??
మా లాంటి సామాన్యులను దృష్టిలో పెట్టుకుకొని పాలించు
ఏమయ్యా రోశయ్య....5 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా చేసి ప్రపంచ రికార్డు సాదించారు కదా......
సగటు సామాన్యుడి ఆర్థిక కష్టాలు కనపడటంలేదా?
ఈ మాటలు అంటున్నది నేను మాత్రమె కాదు....ఇది సామాన్యుడి ప్రజాగళం



11, జనవరి 2010, సోమవారం

తెలంగాణా అభివృద్ధి అంటే ఇదేనా......



 ఉద్యమాల గడ్డ నా తెలంగాణా
ఉద్యమాలకు పునాది నా తెలంగాణా
ఉద్యమాలకు ఆయువు నా తెలంగాణా
అన్ని రకాల వనరులు ఉన్న గడ్డ నా తెలంగాణా
సిరిగల్ల నా తెలంగాణాను దోచుకోవడమే గాని....అభివృద్దికి నోచుకోవడం లేదు.....
మా పాలమూరు జిల్లాలకు వెళ్లి చుడండి.....ఒక్కొక్క ఊర్లో ఒక్కరోజు పర్యటించండి
బ్రతుకుదేరువుకని బొంబాయికి పోతున్న అమాయకులను చుడండి
అక్కడికి వెళ్లి రోడ్ల మీద కాగితాలు ఏరుకొని....చెత్త కుండిలా పక్కన పడుకుంటున్నారు
ఓ సీమంధ్ర నేతల్లారా.......ప్రాజెక్టులు ఆంధ్రకు.....పాట్లేమో మాకా???
తెల్ల దొరలూ పోయి....నల్ల దొరలూ వచ్చినా.....మా బ్రతుకులు ఇంకా చిద్రమేనా......?
ఇదేనా మీరు చేసిన అభివృద్ధి......మేము పడుతున్న తిప్పలు చుడండి....
అప్పుడు కూడా మీరు చలించకపోతే..... మీకు మా ఊర్లో తిరిగే కుక్కలకు పెద్ద తేడ ఏమి ఉండదు.....


జై తెలంగాణా....జై జై తెలంగాణా....

తెలంగాణా రాష్ట్ర రోడ్ చిత్రం





తెలంగాణా రాష్ట్ర సాధనకై మనమందరం పోరాటాన్ని ఉదృతం చేద్దాం రండి......
మన రాష్ట్రం......మన పాలన......
జై తెలంగా....జై జై తెలంగాణా.....

తెలంగాణ మాతృ గీతం





మాతృ గీతం రచన: అందెశ్రీ

జయజయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం

|| జయ…||
తరతరాల చరితగల తల్లీ నీరాజనం

|| తర…||
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ జై జై తెలంగాణ

|| జై…||

పోతనదీ పురిటిగడ్డ రుద్రమదీ వీరగడ్డ
గండర గండడు కొమురం భీముడేలే బిడ్డ
కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప
గోలుకొండ నవాబుల గొప్పవెలుగె చార్మినార్

|| జై…||

జానపదా జనజీవన జావళీలు జాలువార
కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు
జాతిని జాగృతపరచే గీతాలా జనజాతర
అనునిత్యం నీ గానం అమ్మ నీవె మాప్రాణం

|| జై… ||

సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం
అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం
సహజమైన వనసంపద సక్కనైన పూవులపొద
సిరులుపండె సారమున్న మాగాణియె కద నీ ఎద

|| జై…||

గోదావరి కృష్ణమ్మలు మన బీళ్ళకు మళ్ళాలి
పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగ ఉండాలె
స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి

తెలంగాణా ప్రతిజ్ఞ......







మన తెలంగాణా మాకు వచ్చాక మనం  చేసే ప్రతిజ్ఞ 
భారతదేశం నా మాతృభూమి.
భారతీయులందరూ నా సహోదరులు.
నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను.
సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణం.
దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను.
నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందర్ని గౌరవిస్తాను.
ప్రతివారితోను మర్యాదగా నడచుకొంటాను.
నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.

జై తెలంగాణా....జై జై తెలంగాణా......
జై హింద్...

9, జనవరి 2010, శనివారం

ఓలి పాలు ఓలికమ్మ.....



మన తెలంగాణా తల్లి పాలు తాగుతూ...
మన గడ్డ మీద మనల్నే పాలిస్తూ.....
మనల్ని అనిచివేస్తూ....మన గుండెల మీద తన్ని
వెనకేస్కున్న సొమ్ము ఎవడబ్బసొమ్ము......
మీ తల్లిదండ్రులు సంపాదించారా....లేక మీ మామలు సంపాదించారా.....
దమ్ముంటే మీకు మా తెలంగాణా గడ్డమీద ఎంతెంత అస్తులున్నాయో.....
అవి ఎలా సంపాదించారో.....లెక్క తేల్చండి........
అప్పుడు మేము కూడా సమైక్య ఆంధ్రకు కట్టుబడి ఉంటాము......


జై తెలంగాణా....జై జై తెలంగాణా....

జై తెలంగాణా....



అమరులైన తెలంగాణా వీరుల
ఆత్మబలం, గుండె దైర్యం , కలగలసిన పుణ్య భూమి మన వీర తెలంగాణా......
ఈ తెలంగాణా రాష్ట్రం మన కష్టం
వీరుల రక్తపు బొట్టులా త్యాగఫలం,
అన్ని కుల, మతాలకు అతీతంగా పాలిద్దాం
స్వర్డ రాజకీయ ఎత్తులను తరిమి తరిమి కొడుదాం


జై తెలంగాణా.....జై జై తెలంగాణా......

8, జనవరి 2010, శుక్రవారం

అశ్రు నివాళి........




మనమంతా చేస్తున్న తెలంగాణా పోరాటంలో నీ ప్రాణాలు పోగొట్టుకున్నావు......
ఈ తెలంగాణా పోరాటం ఎంత మంది తెలంగాణా కోసం చేస్తున్నారో....
ఎంత మంది తమ స్వార్ధ రాజకీయాలకు చేస్తున్నారో ఆ భగవంతుడికే ఎరుక..
ఈ పోరాటం లో మనం గెలవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ......
నీకు ఇవే మా పాదాభివందనం.........

జై తెలంగాణా......జై జై తెలంగాణా.....

ఏమైంది కెసిఆర్ సారూ...............




నువ్వు మొదలు పెట్టిన దీక్ష వాళ్ళ నీ ప్రాణానికి హాని జరుగుతదని,
అలా జరగకూడదని మేమంతా మా ప్రాణాలను ఫలంగా పెట్టి నిన్ను కాపాడుకున్నాము......
అందుకు ఉదాహరణ మా సహోదరుడైన కీ.శే. శ్రీకాంత్
తన ఆత్మ బలిదానం చేసాక తెలంగాణా వస్తాదనుకున్నం.....
తెలంగాణా వచ్చేసిందని సంబరాలు జరుపుకున్నాం......
ఇక వచ్చేసిన్దనుకున్న సమయంలో.....ల(జ)గడపాటి అడ్డం వచ్చే.....
నీ పోరాటం ఉదృతం చేయ్యన్న...మీ వెనుక మేమున్నాం.......
ఒకరు కాదు ఇద్దరు కాదు.....4 కోట్ల మందిమి ఉన్నాము....
అన్ని చేసి ఇప్పుడేమో ac కార్లలో, విమానల్లో డిల్లి లో గల్లిలన్ని తిరుగుతున్నావ్......
జరా మన తెలంగాణా సంగతి చుదరాదే నీకు పున్యముంటది బాంచెను.........

జై తెలంగాణా......జై జై తెలంగాణా.....

Free Blogger Templates by Santosh Kumar and Unbelievable Photo Collection. Powered by Blogger