సోమవారం 8 మార్చి 2010

సామాన్యుడి గోడు.....రోశయ్య పాలనకు వినపడదా




మాది ఉమ్మడి కుటుంబం, మాకు తెల్ల రేషన్ కార్డు ఉంది. నెలకు రేషన్‌ ద్వారా 20 కిలోల బియ్యం వస్తున్నాయి. కిలో చెక్కర, 8 లీటర్ల కిరోసిన్‌ ఇస్తున్నారు. వీటిని బయట కొంటే మేము రోజూ కష్టపడి పని చేసిన డబ్బంతా వాటికే పెట్టాల్సివస్తుంది. అన్ని సరుకుల ధరలూ పెరిగాయి. రేషన్‌ దుకాణం ద్వారా ఇచ్చే చక్కెర, కిరోసిన్‌ తగ్గిస్తే ఎట్ల బతకాలి? 8 లీటర్ల కిరోసిన్‌ ఒక నెలంత ఎలా సరిపోతది. బ్లాకు లో లీటరుకు 30 రూపాయలు పెట్టి మరో పది లీటర్లు కొనుక్కుంటే గాని నెల గడవడం లేదు....ఇంతకూ ముందులా తెల్ల రేషన్ కార్డు వాళ్ళందరికీ 20 లీటర్ల కిరోసిన్ ఇస్తేనే మాలాంటి సామాన్యుడు కొంచమైన ఆనందంగా బ్రతకగలరు.

సంక్షేమం పేరుతో ప్రభుత్వం అమలు చేస్తున్న రేషన్‌ పథకంలో చేరిన బోగస్‌ కార్డులు ఖజానాను గుల్ల చేస్తున్నాయి. బోగస్‌ భారం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు మూడడుగులు ముందుకు, ఆరడుగులు వెనక్కు అన్నట్లు గా మారాయి. ఈ నెలలోగా పూర్తి కావాల్సిన బోగస్‌ కా ర్డుల ఏరివేత కార్యక్రమం ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో పూర్తయితే గొప్పేనని అధికారవర్గాలు చెబుతు న్నాయి.

దశల వారీగా ఐదు దశలలో పూర్తిచేయాల్సిన సర్వే పనులు ఇంకా పలు జిల్లాల్లో ప్రాథమిక దశలోనే కునికి పాట్లుపడుతున్నాయి. కార్డుల ఏరివేతలో జరుగు తున్న జాప్యం ప్రభుత్వ ఖజానాకు పెద్ద గుదిబండగా మారి ఆర్ధిక పరిస్థితిని మరింత కుంగదీస్తోందని ప్రభుత్వవర్గాలు పేర్కొంటున్నాయి. బోగస్‌ కార్డులకు సంబంధించి ప్రభుత్వ వర్గాలు చేస్తున్న సర్వే అంచనాలు కూడా కాకి లెక్కలను తలపిస్తున్నాయి. మొదటి దశలో చేసిన సర్వేలో బోగస్‌ రేషన్‌కార్డులు 10 నుంచి 15 శాతం ఉన్నట్లు వెల్లడిం చారు. ఇక దానినే ప్రామాణికంగా తీసుకుని కాస్త అటూ ఇటుగా అదే స్థాయిలో బోగస్‌ కార్డులు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనినిబట్టి మొత్తం ఐదు దశలలో సుమారు యాభై లక్షల వరకు బోగస్‌ కార్డులు న్నట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది. అయితే సర్వే పనులు ఎంచుకున్న ప్రమాణాల మేరకు జరుగు తున్నాయా అన్న అంశంపై సందేహాలు వ్యక్తమవు తున్నా యి.

రాష్ట్రంలో అరకోటి కుటుంబాలలో ఉన్న బోగస్‌ కార్డు లను రద్దు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం అసలు కార్డులకు ఎక్కడ ఎసరు తెస్తుందోనన్న అనుమానాలు, ఆందోళనలు సామాన్య ప్రజలలో వ్యక్తమవుతున్నాయి. ఏరివేత పూర్తయితేనే కొత్త కార్డులు ఇస్తామని, అదనపు బియ్యం కోటా ఇస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు గత నెలలో ప్రకటించారు. దీనిని బట్టి చూస్తే మంత్రి ప్రకటన ఇప్పట్లో అమలుకు నోచుకునే పరిస్థితి కూడా కనిపించడంలేదు. బోగస్‌ కార్డుల ఏరివేత సర్వే పనులకు కరవు, వరదల వంటి ప్రకృతిపరమైన విపత్తులు ఆటంకంగా మారాయంటూ అధికారులు ఎప్ప టికప్పుడు ఏరివేత లక్ష్యాలను పొడిగించుకుం టున్నారు.

ఆరోగ్య శ్రీ కోసమే బోగస్‌లు...
పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకం వారికన్నా బోగస్‌ కార్డుల రూపంలో ప్రభుత్వ ఖజానాను గుల్ల చేస్తోంది. రాష్ట్రంలో పేద ప్రజల ఆరోగ్య సంక్షేమం కోసం ప్రభుత్వం 2007 జూన్‌ మాసంలో ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశ పెట్టింది. దీని ద్వారా ఇప్పటి వరకు 3 లక్షల 6 వేల 380 మంది శస్త్ర చికిత్సలు పొందారు. ఆరోగ్య శ్రీ ట్రస్టు లెక్కల ప్రకారం ఈ చికిత్సలకు ఇప్పటి వరకు 985 కోట్ల రూపాయలు ఖర్చయింది. అయితే ఈ పథకం కేవలం తెల్లరేషనుకార్డు ఉన్న వారికే కావడంతో రాష్ట్రంలో బోగస్‌ కార్డులకు తెరలే చిందని అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఆరోగ్య శ్రీ పథకంలో లబ్ది పొందేందుకు అర్హుల తోపాటు అత్యధిక సంఖ్యలో అనర్హులు సైతం తెల్లకార్డులు పొందారని పౌర సరఫరా అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎన్నికలు జరగక ముందు వరకు తెల్లరేషను కార్డులు, అంత్యోదయ అన్నయోజన, అన్న పూర్ణ పథకాల కార్డులు కలిపి 1.88 లక్షల వరకు తెల్లకా ర్డులున్నాయి. ఆ తర్వాత వాటి సంఖ్య 2.27 కోట్లకు చేరిం ది.. ఇంకా 20 లక్షల వరకు కార్డులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీటిలో దాదాపు 30 లక్షల కార్డులు బోగస్‌విగా ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. సర్వే మొదలయ్యాక బోగస్‌ల సంఖ్య 50 లక్షల దాకా ఉండవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. బోగస్‌ కార్డులలో అత్యధికంగా ఆరోగ్య శ్రీ పథకంలో లబ్ధి పొందడం కోసం తీసుకున్నవే ఉన్నట్లు సర్వేవర్గాలు పేర్కొంటున్నాయి.

2 మీ మనసులోని మాటలు:

  1. అజ్ఞాతMar 8, 2010 03:15 AM

    KCR ku vinipistOndaa? mari lolli chEyakunDaa vyoohaatmakangaa moosukunnaaDaa? :D

    ప్రత్యుత్తరంతొలగించు
  2. అజ్ఞాతMar 8, 2010 03:22 AM

    kcr ku e time lo chevulu sarigga panicheyavanta mari......roshaiah ku kanti chupu sarigga panicheyadaye.....mari

    ప్రత్యుత్తరంతొలగించు


Free Blogger Templates by Santosh Kumar and Unbelievable Photo Collection. Powered by Blogger